Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్రెడ్డికి బాధ్యతలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా అదాల ప్రభాకర్ రెడ్డి అధిష్ఠానం నియమించింది. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఆ బాధ్యతల నుంచి అధిష్ఠానం తప్పించింది.
తాడేపల్లి: వైకాపా నేతల్లో అసంతృప్తి, విభేదాల దృష్ట్యా సీఎం జగన్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. నేతల మధ్య విభేదాలు, పరిష్కారం, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. వాలంటీర్లు కార్యదర్శుల నియామకంపై కూడా భేటీలో చర్చించారు. 26 జిల్లాల పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
త్వరలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై చర్యలు: బాలినేని
సమావేశం ముగిసిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఫోన్ కాల్ను ఆయన స్నేహితుడే రికార్డింగ్ చేశారని తెలిపారు. కోటంరెడ్డిపై చర్యలకు సంబంధించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడే ఎందుకు చెప్పారని నిలదీశారు. వెళ్లే ముందు ఏదో ఒక విమర్శలు చేసి పోతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కోటంరెడ్డి స్నేహితుడే ఫోన్ కాల్ రికార్డ్ చేశారని తెలిపారు. ‘‘ఫోన్ రికార్డింగ్ చేసి ట్యాపింగ్ అంటున్నారు. కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి వచ్చి అన్నీ చెబుతారు. డిసెంబరు 25న చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడినట్టు తెదేపా నేతలు చెబుతున్నారు. లోకేశ్తో కోటంరెడ్డి ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. కోటంరెడ్డిని సీఎం నమ్మితే ఆయన నమ్మక ద్రోహం చేశారు’’ అని పేర్ని నాని అన్నారు.
ఎంపీ ఆదాలకు కొత్త బాధ్యతలు..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో వైకాపా అగ్రనాయకత్వం రూరల్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఇన్ఛార్జి నియామకం కోసం పలువురు పేర్లను అధిష్ఠానం పరిశీలించినప్పటికీ.. చివరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో నెల్లూరు నగరంలోని ఆదాల నివాసం వద్ద వైకాపా కార్యకర్తల సందడి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత