Ajit Pawar: శరద్జీపై గౌరవం ఉన్నా.. కాలం మారింది: ఎమ్మెల్యేలకు అజిత్ పవార్ ఫోన్
మహారాష్ట్ర(Maharashtra)లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ( NCP)కి చెందిన రెండు వర్గాలు బుధవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి.
ముంబయి: ఎన్సీపీ(NCP)లో తిరుగుబాటుతో శరద్ పవార్(Sharad Pawar), అజిత్ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని రెండు వర్గాలు బుధవారం సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏ పక్షం బలం ఎంతో తేలనుంది. ఈ క్రమంలో ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని.. అజిత్ శిబిరం ఎన్సీపీ ఎమ్మెల్యేలను కోరింది.
ఈ కీలక సమావేశాలకు ముందే అజిత్ వర్గం ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, తమతో చేతులు కలపాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘మాతో కలిసిరావడం వల్ల 2024 ఎన్నికల్లో మేలు జరుగుతుంది. మీ నియోజకవర్గంలో పూర్తికాని ప్రాజెక్టులకు.. నిధులు పొందేందుకు మేం సహకరిస్తాం. మీకు శరద్ పవార్పై గౌరవం ఉందని తెలుసు. కానీ, ఈ సమయంలో ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. మారిన కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి’ అని అజిత్ వర్గం నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే వేదిక వద్దకు చేరుకుంటున్న నేతలతో అఫిడవిట్లో సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. వీటిని ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ఎన్సీపీ పేరు, గుర్తు కోసం పోరాడేందుకు ఇవి ఉపకరిస్తాయని భావిస్తున్నారు.
విప్ జారీ చేసిన శరద్ పవార్..
మరోపక్క ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్లో జరుగుతోన్న పార్టీ సమావేశానికి నేతలంతా హాజరుకావాలంటూ శరద్ పవార్ వర్గం విప్ జారీ చేసింది. ఇంకోపక్క ఎన్సీపీ కార్యవర్గ అధ్యక్షురాలు సుప్రియా సూలే(Supriya Sule) నేతలను ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశారు. ‘భారీ సంఖ్యలో నేతలంతా బుధవారం జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో 83 ఏళ్ల పోరాటయోధుడు మార్గనిర్దేశం చేస్తారు’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట