Punjab Polls: 101% గెలుపు మాదే..భాజపాతో ‘కెప్టెన్’ దోస్తీ ఫిక్స్!
పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్తో తన సుదీర్ఘ బంధానికి......
దిల్లీ: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్తో తన సుదీర్ఘ బంధానికి స్వస్తి చెప్పిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపాతో పొత్తు పెట్టుకొంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా భాజపా అగ్రనేతలతో వరుస భేటీలు అయిన కెప్టెన్.. ఈ ఎన్నికల్లో కమలనాథులతో కలిసి పంజాబ్ అధికార పీఠాన్ని దక్కించుకుంటామని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు ఖరారైంది. ఈ మేరకు కేంద్రమంత్రి, పంజాబ్ భాజపా ఇంఛార్జి గజేంద్రసింగ్ షెకావత్తో అమరీందర్ సింగ్ దిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు.
తమ పొత్తు ఖరారైందని, ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్టు కెప్టెన్ స్పష్టంచేశారు. గెలుపు తమదేనన్నారు. సీట్ల పంపకాలపై తదుపరి చర్చలు కొనసాగుతాయని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న సీట్ల వారీగా కేటాయింపులు జరుగుతాయన్నారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో 101శాతం గెలుపు తమదేనంటూ కెప్టెన్ విశ్వాసం వ్యక్తంచేశారు. ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఈరోజు భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. సీట్ల పంపకాలపై చర్చలు ఇకపై జరుగుతాయన్నారు.
కొన్ని దశాబ్దాల పాటు పంజాబ్లో అకాలీదళ్కు జూనియర్ భాగస్వామిగా కొనసాగుతూ వచ్చిన భాజపా ఈసారి కెప్టెన్తో పొత్తు పెట్టుకోవడం గమనార్హం. మరికొద్ది నెలల్లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం