కేరళ కూటములకు ప్రత్యామ్నాయం భాజపానే..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీపైపే కేరళ ప్రజలు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
తిరువనంతరపురం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని కేరళ ప్రజలు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటించిన ఆయన, గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గోల్డ్ స్కాంపై కేంద్ర సంస్థలు దర్యాప్తుపై రాష్ట్ర సర్కార్ విమర్శలు చేస్తుండడంపైనా కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలో ఏ కుంభకోణం జరిగినా వాటిపై భారతీయ సంస్థలే దర్యాప్తు జరుపుతాయని, ఐరాస వంటి సంస్థలు కావని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. త్రిపునిథురలో జరిగిన రోడ్షోకు భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు. కేరళ ప్రజలు భాజపాకు మద్దతు తెలుపుతున్నారనడానికి ఇదే నిదర్శమని అమిత్ షా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను బహిరంగ సభ ద్వారా అక్కడి ప్రజలకు అమిత్ షా వివరించే ప్రయత్నం చేశారు.
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..
కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ బోధకులు రైలు ప్రయాణంలో వేధింపులకు గురైన ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రచార సభలో ఉన్న అమిత్ షా హామీ ఇచ్చారు. రైలు ప్రయాణం చేస్తోన్న కేరళ క్రైస్తవ మహిళా బోధకులను ఉత్తర్ ప్రదేశ్లోని ఝాన్సీ సమీపంలో కొందరు యువకులు వేధింపులకు గురిచేసి రైలు నుంచి దించివేశారనే ఆరోణలు వచ్చాయి. వీరు మతప్రచారం చేస్తున్నారంటూ కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, మహిళా బోధకులను మరో రైలులో స్వస్థలాలకు పంపించారు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్ షా, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత