Polavaram: పోలవరంలో నాడు-నేడు.. ఫొటో గ్యాలరీ ద్వారా మంత్రి అంబటి వివరణ

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరంలో నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Published : 08 Aug 2023 17:10 IST

పోలవరం: రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరంలో నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజక్టు 2019 నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని ఫొటోల ద్వారా వివరించారు. పోలవరం స్పిల్‌వే, కాంక్రీట్‌ డ్యామ్‌, అప్రోచ్‌ ఛానల్‌ పురోగతిపై మంత్రి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడుతూ...‘‘ పోలవరం ప్రాజెక్టుపై తెదేపా అధినేత చంద్రబాబు నిన్న అబద్ధాలు చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ప్రాజెక్టు వద్దకు వచ్చా. మేం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశాం. గైడ్‌బండ్‌ కుంగటం వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదు. స్పిల్‌ ఛానల్‌ దెబ్బతినకూడదనే.. డిజైన్‌లో లేకున్నా గైడ్‌బండ్‌ కట్టాం’’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని