Andhra News: విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఏపీ ఎంపీలు.. ప్రైవేటుకే కేంద్రం మొగ్గు!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్సభలో ఏపీ ఎంపీలు గళమెత్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం అశాస్త్రీయమని నిలదీశారు. నష్టాల కారణం చూపి ప్లాంట్ను
దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్సభలో ఏపీ ఎంపీలు గళమెత్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం అశాస్త్రీయమని నిలదీశారు. నష్టాల కారణం చూపి ప్లాంట్ను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనుకునే ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రాన్ని కోరారు. గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని దీనిపై పునరాలోచించాలని తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్ప్లాంట్కు కాప్టివ్ మైన్స్ లేవని.. మైన్స్ కేటాయిస్తే లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఉద్యమం చేసి సాధించుకున్న స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెయిల్ను కాకుండా విశాఖ ఉక్కును మాత్రమే ప్రైవేటీకరణ చేయడమేంటని ప్రశ్నించారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రధాని మోదీ పునరాలోచించాలని వైకాపా ఎంపీ మార్గాని భరత్ విజ్ఞప్తి చేశారు. కాప్టివ్ మైన్స్ కావాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఎంపీలకు బదులిచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించనప్పటికీ కొంత కాలం పరిశ్రమ లాభాల బాటలో పయనించిందని బదులిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణే ఉత్తమ నిర్ణయమని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి