‘రేషన్‌’ వాహనాల రంగులు మార్చండి: ఎస్‌ఈసీ

ఏపీలో బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. వాహనాలపై వైకాపా రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ..

Updated : 06 Feb 2021 13:19 IST

అధికారులకు ఆదేశం

అమరావతి: ఏపీలో బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. వాహనాలపై వైకాపా రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ అభిప్రాయపడింది. పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి తేవాలని అధికారులకు సూచించింది. అంతవరకు గ్రామాల్లో వాహనాలతో రేషన్‌ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. రంగులు మార్చాకే వాహనాల ద్వారా పంపిణీకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. రెండ్రోజుల క్రితం వాహనాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి..

ప్రభుత్వంలో చర్చించాక మాట్లాడతాం: బొత్స జగన్‌ ముందుంటే.. మేమంతా ఆయన వెంటే: అయ్యన్న

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని