Aparna Yadav: ప్రత్యర్థి పార్టీలో చేరి.. ములాయం ఆశీస్సులు తీసుకున్న అపర్ణ..!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణ యాదవ్ భాజపాలో చేరడం ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
లఖ్నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణ యాదవ్ భాజపాలో చేరడం ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ నుంచి బయటకు వెళ్లిన ఆమె.. తాజాగా మామ ములాయం వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తిగా మారింది. దానికి సంబంధించిన చిత్రాన్ని అపర్ణ నెట్టింట్లో షేర్ చేశారు. భాజపాలో చేరిన తర్వాత లఖ్నవూలో మామయ్య ఇంటికి వచ్చి, ఆశీస్సులు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
అపర్ణ భాజపాలో చేరడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె భాజపాలో చేరకుండా ఆపేందుకు నేతాజీ (ములాయం) తీవ్రంగా ప్రయత్నించారని అఖిలేశ్ వెల్లడించారు. అంతేకాకుండా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలూ చేశారు. ఆమె పార్టీ మార్పు ఎస్పీ సిద్ధాంతాన్ని విస్తరించేందుకు దోహదం చేస్తుందన్నారు.
గురువారం ములాయం తోడల్లుడు ప్రమోద్ గుప్తా కూడా సైకిల్ దిగి కమలం గూటికి చేరారు. గతంలో ఎస్పీ శాసనసభ్యుడిగా పనిచేసిన ప్రమోద్.. ములాయం రెండో భార్య సాధనా గుప్తా సోదరి భర్త. ప్రమోద్ పార్టీని వీడుతూ.. అఖిలేశ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి ములాయంను అఖిలేశ్ ఓ ఖైదీలా బంధించి ఉంచారని, నేతాజీని బహిరంగంగా మాట్లాడనీయడం లేదని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!