Chhath festival: కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసన.. భాజపా ఎంపీకి గాయాలు!
దేశ రాజధాని నగరంలో ఛత్ వేడుకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భాజపా నిరసనకు దిగింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద.......
దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఛాత్ వేడుకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భాజపా నిరసనకు దిగింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భాజపా ఎంపీ మనోజ్ తివారీకి గాయమైంది. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆయన చెవి భాగంలో గాయమైనట్టు భాజపా నేత నీల్కాంత్ బక్షి తెలిపారు. నగరంలో బిహార్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్ల లక్షలాది మంది ప్రజలు జరుపుకొనే ఈ వేడుకపై నిషేధం విధించడాన్ని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ఇతర నేతలు ఖండించారు.
కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో బహిరంగంగా ఛాత్ వేడుకలపై నిషేధం విధిస్తూ దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసింది. అయితే, దీనిపై భాజపా నేత ఆదేశ్ గుప్తా నిన్న మాట్లాడుతూ.. ఛాత్ వేడుకలను ఘనంగా నిర్వహించి తీరతామని ప్రకటించారు. భాజపా పాలిత మున్సిపల్ కార్పొరేషన్లలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఛాత్ వేడుకలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డీడీఎంఏకు ప్రతిపాదన పంపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రజల ఆరోగ్యం, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం విధించినట్టు సీఎం కేజ్రీవాల్ ఇటీవల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి