Akhilesh Yadav: కాంగ్రెస్ పనైపోయింది.. భాజపా పరిస్థితి అదే..!
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న భారతీయ జనతా పార్టీ (BJP)కి కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
కోల్కతా: విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మరోసారి ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్కు జరిగినట్లుగానే భాజపా కూడా రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇక కులగణనను ప్రస్తావించిన ఆయన.. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంమన్నారు.
‘గతంలో కాంగ్రెస్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసేంది. ప్రస్తుతం భాజపా కూడా అదేపని చేస్తోంది. కాంగ్రెస్ పని అయిపోయింది. భాజపాకూ అదే గతి పడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కుల గణన చేపట్టాలి. ఎంతో మంది నాయకులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. యూపీఏ-2 హయాంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, చివరకు వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్ మాదిరిగానే భాజపా కూడా వాటిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్ యాదవ్ అన్నారు.
ఇక ఎన్నికలకు ముందు విపక్ష కూటమి కోసం ప్రతిపాదించిన ఫార్ములా ఏంటని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దాన్ని ఇప్పుడే బహిర్గతం చేయమని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. కేవలం భాజపాను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపై జాతీయ రాజకీయాల్లో చర్చ నడుస్తోన్న సమయంలో భాజపాతో పాటు కాంగ్రెస్కూ తాము దూరంగా ఉంటామని అఖిలేశ్ ఇటీవలే స్పష్టం చేశారు. తృణమూల్ నేత మమతా బెనర్జీతో చర్చలు జరిపిన ఆయన.. భాజాపాను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందన్న అఖిలేశ్.. 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని ఇటీవల అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక