ఆ గాయం దీదీని ఎప్పటికీ వెంటాడుతుంది: షా
బెంగాల్లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
దిల్లీ: బెంగాల్లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి తగిలిన గాయం మమతా బెనర్జీని ఎప్పటికీ వెంటాడుతుందని మండిపడ్డారు. ఈ మేరకు షా ట్విట్ ద్వారా మృతురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.‘టీఎంసీ కార్యకర్తల చేతిలో దాడికి గురై బెంగాల్ కుమార్తె శోభా మజుందార్(84) మరణించడం ఆవేదనకు గురిచేసింది. ఆ కుటుంబానికి కలిగిన గాయం మమతా బెనర్జీని ఎల్లకాలం వెంటాడుతుంది. బెంగాల్ ప్రజలు హింసకు తావు లేని రాష్ట్రం కోసం, మహిళలకు రక్షణ కల్పించే రాష్ట్రం కోసం పోరాటం చేయాలి’ అని షా ట్వీట్లో పేర్కొన్నారు.
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ విషయంపై ట్విటర్ ద్వారా స్పందించారు. ‘శోభా మజుందార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కేవలం తన కుమారుడు భాజపా కార్యకర్త కావడం వల్లే ఈ రోజు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె త్యాగం ఎల్లప్పటికీ నిలిచిపోతుంది. బెంగాల్లో తల్లులు, సోదరీమణుల సంరక్షణకు భాజపా పోరాడుతుంది’ అని నడ్డా తెలిపారు.
గతనెలలో బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా నింతా పోలీస్స్టేషన్ పరిధిలో గోపాల్ మజుందార్ అనే తమ కార్యకర్త ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. తమ కార్యకర్తపై, 84 ఏళ్ల వయసున్న అతడి తల్లిపై టీఎంసీ కార్యకర్తలు దారుణంగా దాడికి పాల్పడ్డారని మండిపడింది. కాగా, ఈ ఆరోపణల్ని టీఎంసీ పార్టీ ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు