Andhra News: ‘అప్పర్భద్ర’ను జగన్, కేసీఆర్ క్రికెట్ మ్యాచ్లా చూస్తున్నారు: బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
అప్పర్భద్ర ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల సీఎంలు అత్యవసర భేటీ ఏర్పాటు చేయాలని బైరెడ్డి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని.. దీని నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కోరారు.
కర్నూలు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్భద్ర ప్రాజెక్టు (Upper Bhadra project) నిర్మాణంతో రాయలసీమ ఎడారిగా మారుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి (Byreddy rajasekhar reddy) అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాల నీటి వాటాకు తీవ్ర అన్యాయం వాటిల్లుంతోందని ఆరోపించారు. అప్పర్భద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేపట్టారు. రాజోలి ఆనకట్ట నుంచి ఆదోని వరకు 3 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. అప్పర్భద్ర నిర్మాణాన్ని ఏపీ సీఎం జగన్ (CM Jagan), తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) క్రికెట్ మ్యాచ్లా చూస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల సీఎంలు అత్యవసర భేటీ ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపాలని కోరారు. రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు అప్పర్భద్రను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ లేవనెత్తుతామని హెచ్చరించారు. దీనిపై రాయలసీమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక