Chandra Babu - Pawan: దూకుడు పెంచిన ఎన్డీయే... చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం

ఏపీలో ఏన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది.

Published : 07 Apr 2024 17:31 IST

అమరావతి: ఏపీలో ఏన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని కలిసి నిర్వహించే విధంగా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ప్రజాగళం మూడో విడతలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లు కలిసి పాల్గొననున్నారు. ఈనెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో ప్రజాగళంలో పాల్గొననున్నారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఇరువురు ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు