Andhra News: చంద్రబాబు ఏలూరు పర్యటనలో ఆసక్తికర ఘటన
పోలవరంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పడు రూ.800 కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి...
అగిరిపల్లి: పోలవరంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పడు రూ.800 కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి 3 సీజన్లు దాటినా పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నక్కల గొల్లగూడెంలో నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడారు. సన్న బియ్యం ఇస్తానంటూ ఉన్న బియ్యాన్ని పోగొడుతున్నారన్నారు. సీఎం జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటమని స్పష్టం చేశారు. అప్పులు ఎంత తెచ్చారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు పాదయాత్ర సాగింది. తెలుగుదేశం అధినేత రాకతో అడవినెక్కలం, నెక్కలం గొల్లగుడెం గ్రామాలు పసుపు మయంగా మారాయి. రావిచర్ల సర్పంచి కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 73 కేజీలు కేకుని చంద్రబాబు కట్ చేశారు. చంద్రబాబుని తెలుగుదేశం శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గ్రామాల్లో పేదల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
గ్రామ సభలో ఆసక్తికర ఘటన..
నక్కల గొల్లగూడెంలో నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాట్లాడే అవకాశం ఇవ్వాలని గ్రామసభకు వచ్చిన వైకాపా నేత కాజా రాంబాబు కోరారు. ‘‘ఎమ్మెల్యే ప్రతాప్ కుమారుడు అవినీతికి పాల్పడ్డారు. గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతాను. ఎమ్మెల్యే కుమారుడి అవినీతిపై పోరుకు మద్దతు ఇవ్వాలి’’ అని రాంబాబు కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. రాంబాబు పోరాటాన్ని పార్టీలకు అతీతంగా చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్