Chandrababu: జగన్ సింగిల్గా రావట్లేదు.. శవాలతో వస్తున్నారు: చంద్రబాబు
జెండాలు వేరయినా అజెండా ఒక్కటేనని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసి.. కలిసి ముందుకొచ్చామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
నిడదవోలు: జెండాలు వేరయినా అజెండా ఒక్కటేనని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసి.. కలిసి ముందుకొచ్చామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిడదవోలు ‘ప్రజాగళం’ సభలో జనసేనాని పవన్, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘జగన్ చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీయే ఆక్సిజన్లా బతికిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం. రాజధాని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి ఏన్డీయేకి ఉంది
రాష్ట్రంలో ఒక్క రైతు అయినా బాగుపడ్డారా? పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా?వరద సాయం చేశారా? ఎక్కువ అప్పులు చేసిన రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. నిత్యావసరాల ధరలు పెంచారు. వైకాపా ఎమ్మెల్సీ తన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారు. వైకాపా ప్రభుత్వం వస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ చేస్తారు. జగన్ సింగిల్గా రావట్లేదు.. శవాలతో వస్తున్నారు. జగన్ గొడ్డలి వేటుకు బలి కానివారు ఉన్నారా? పింఛన్ల విషయంలోనూ శవరాజకీయాలు చేశారు. టికెట్లు ఇస్తామన్నా తీసుకోకుండా వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పారిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు