Andhra News: వాటిని గమనించే జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా.. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా.. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం సీఎం జగన్కు అర్థమవుతోందని చెప్పారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, ఓటర్ వెరిఫికేషన్, మహానాడు తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో సమీక్షించారు.
‘‘జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బూటకమేనని ప్రజలకు అర్థమవుతోంది. ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వీటన్నింటినీ గమనించిన సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీపైనే ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో తెదేపాకు స్వాగతాలు, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతలకు నిలదీతలే ఇందుకు నిదర్శనం. వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తెదేపా నేతలు గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికీ వెళ్లాలి. నాయకులు అనే వారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలి. జగన్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని చంద్రబాబు తెలిపారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తన పర్యటనల్లో వస్తున్న స్పందనను ఈ సందర్భంగా పార్టీ నేతలతో చంద్రబాబు పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ