Pawan Kalyan: మరోసారి వైకాపా వస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదు: పవన్
రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
మంగళగిరి: రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీనివాసులు నాకు తెలుసు. నాతో కలిసి ప్రయాణిస్తానని చెప్పారు. రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయింది. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్రెడ్డితో నాకు విభేదాలు లేవు. కానీ, సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోసారి వైకాపా వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమీ మిగలదు. ఉపాధి కోసం చాలా మంది అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిపోతున్నారు. భయం వదిలేస్తేనే పరిస్థితులు మారతాయి. జగన్ గుంపు నుంచి సీమను రక్షించుకోవాలి. వైకాపా నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
కర్నూలులో సుగాలి ప్రీతి హత్య నన్ను కలచివేసింది. జనసేన ఒత్తిడి వల్లే ఆ కేసును సీబీఐకి ఇచ్చారు. నాకు వ్యక్తిగతంగా పలుకుబడి, డబ్బులు ఉన్నాయి, పెద్ద కుటుంబం ఉంది. కానీ, అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే తెలుగు జాతి నా కుటుంబం అనుకున్నా. ఈసారి అణగారిన వర్గాలకు అండగా ఉందాం. చిన్న కులాల్లో ఐక్యత లేక జగన్కు ఊడిగం చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు మా ఆవరణలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలి.. లేదంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని గుర్తు పెట్టుకుంటాం. వైకాపాకు కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్