Regional Parties: ప్రాంతీయ పార్టీలు పెరగడానికి కాంగ్రెస్సే కారణం - జేపీ నడ్డా
యావత్ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ కాదని.. అన్నా-చెల్లల పార్టీగా మారిపోయిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు.
కాంగ్రెస్ని అన్నా-చెల్లెల పార్టీగా అభివర్ణించిన భాజపా అధ్యక్షుడు
దిల్లీ: యావత్ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ కాదని.. అన్నా-చెల్లెల పార్టీగా మారిపోయిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వారసత్వ పార్టీలపై మండిపడ్డ ఆయన.. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలనకు కుటుంబ పార్టీల ముప్పు అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొన్న జేపీ నడ్డా.. సిద్ధాంతాలు లేకపోవడం, ఒకే వ్యక్తి ఆసక్తికి అనుగుణంగా పార్టీ నడవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు. ఇక దేశంలో ప్రాంతీయ పార్టీలు విపరీతంగా పుట్టుకురావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని జేపీ నడ్డా ఆరోపించారు.
‘పుట్టుక ఆధారంగా ఎటువంటి వివక్షనైనా రాజ్యాంగం నిషేధించింది. అయినప్పటికీ ఈ పార్టీల్లో నాయకత్వం మాత్రం జననం ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఈ క్రమంలో ఇతరులు విస్మరణకు గురౌతారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే ప్రతి రాష్ట్రంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తీరు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లే దేశంలో ప్రాంతీయ పార్టీలు వృద్ధి చెందాయని ఆరోపించిన ఆయన.. జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ప్రాంతీయ ఆకాంక్షలకు చోటు కల్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు.
ఈ విషయంలో భాజపా మాత్రం ప్రాంతీయ ఆకాంక్షలకు చోటు కల్పిస్తూనే జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటుందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఇక ప్రాంతీయ పార్టీలు పెరిగే కొద్దీ సిద్ధాంతాలు, ప్రాంతీయ ఆకాంక్షలను పక్కనబెట్టి వ్యక్తుల ఆరాధన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ చివరకు జాతీయ లేదా ప్రజాస్వామ్య పార్టీగా నిలువలేకపోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ కేవలం అన్నా-చెల్లెల పార్టీగా మారిందన్న ఆయన.. అందులో రాహుల్, ప్రియాంక గాంధీలకు పెరిగిన ప్రాధాన్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. కేవలం ఒక్క భాజపా మాత్రమే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తోందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం