Amit Shah: మా హయాంలో ఆ మాటే వినబడదు.. వాళ్ల స్కామ్లు లెక్కపెట్టడమే కష్టం.. కాంగ్రెస్పై షా సెటైర్!
కొత్త సంప్రదాయాలను ప్రారంభించడంలో ప్రధాని మోదీ ముందుంటారని, ఈసారి హిమాచల్ భాజపా తిరిగి అధికారంలోని తప్పక వస్తుందని హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగారా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భాజపా తిరిగి అధికారంలోని వచ్చిన వెంటనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున పొంటా సాహిబ్లో నిర్వహించిన సభలో ప్రతిపక్ష కాంగ్రెస్పై ఆయన విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో స్కామ్ అనే మాట వినిపించదని, కాంగ్రెస్ పాలనలో జరిగిన స్కామ్లు లెక్కిండం కష్టమని ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
భాజపా నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు హిమాచల్లో ఐఐటీ, ఎయిమ్స్ మెడికల్ కాలేజీలను తీసుకురావడమే కాకుండా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని గుర్తుచేశారు. భాజపాలో ప్రధాని మోదీ, సీఎం జైరామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వంటి వారి నాయకత్వం ఉంటే, కాంగ్రెస్లో మాత్రం రాజా-రాణి నాయకత్వం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం కావాలంటే రాజా-రాణి కుటుంబంలో జన్మించాలని ఎద్దేవా చేశారు.
కొత్త సంప్రదాయాలను ప్రారంభిచడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారని, హిమాచల్లో ఈసారి కూడా భాజపానే అధికారం చేపడుతుందని కాంగారా జిల్లాలోని జరిగిన సభలో షా ధీమా వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వన్ ర్యాంక్- వన్ పెన్షన్ విధానాన్ని కూడా తమ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్ పునరుద్ధరణ, ఆర్టికల్ 370 రద్దు, పీవోకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమని అన్నారు.
భాజపా ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని, ఓటు బ్యాంకు గురించి తమకు ఆందోళన లేదని, అభివృద్ధి చేయడంపైనే తమ దృష్టి ఉంటుందని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి రోజూ ఉదయాన్నే ప్రతికూల ట్వీట్లు చేస్తారని, ప్రజలు వాటిని పట్టించుకోనట్లే.. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ను పట్టించుకోకుండా భాజపానే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక