YSRCP: మార్కాపురం వైకాపాలో అసమ్మతి.. అనుచరులతో జంకె వెంకట్రెడ్డి భేటీ
ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపాలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపాలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకట రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అక్కడి టికెట్ను వెంకటరెడ్డి ఆశిస్తున్నారు. ఈనెల 6న నిర్వహించిన వైకాపా సామాజిక బస్సు యాత్ర సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. బుధవారం కనిగిరిలో జరిగిన బస్సు యాత్రకు సైతం బాలినేని, జంకె వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తన అనుచరులతో జంకె వెంకట్రెడ్డి గురువారం సమావేశమయ్యారు. స్థానిక నేతలతో సంప్రదించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గెలిపించాలని ఎలా చెబుతారని విజయసాయిరెడ్డిపై అసమ్మతి నేతలు మండిపడ్డారు. జంకె వెంకటరెడ్డితో స్థానిక నేతలు వెన్నా హనుమారెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్యనేతలు సమావేశమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!