Rajasthan: వైద్యుడి పేరు చెప్పి తప్పించుకున్న గహ్లోత్!
మంత్రివర్గాన్ని విస్తరించాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై ఒత్తిడిపెరుగుతోంది.
దిల్లీ: మంత్రివర్గాన్ని విస్తరించాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై ఒత్తిడిపెరుగుతోంది. దీనిపై సొంతపార్టీకి చెందిన సచిన్ పైలట్ వర్గీయులు డిమాండ్ చేస్తుండగా.. ముఖ్యమంత్రి మాత్రం వైద్యుల పేరు చెప్పి ఆ డిమాండ్లను పక్కనపెట్టారు. కొవిడ్ కారణంగా వ్యక్తిగత సమావేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు గహ్లోత్కు సూచించారని ఆయన వ్యక్తిగత అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ‘కొవిడ్ తదనంతర పరిణామాల దృష్ట్యా, వైదుల సలహా మేరకు ముఖ్యమంత్రి ఎవరిని వ్యక్తిగతంగా కలవలేరు. అన్ని సమావేశాలు, నిర్ణయాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. రెండు నెలల పాటు వీడియో కాన్ఫరెన్స్ వేదికగానే సమావేశాలు నిర్వహించాలని వైద్యులు చెప్పారు’ అని తెలిపారు.
గతేడాది తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ను బుజ్జగించి..రాజస్థాన్ కాంగ్రెస్లో పలు మార్పులకు సంబంధించి దిల్లీలోని పార్టీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నెరవేర్చేందుకు గహ్లోత్ సుముఖంగా లేరు. పైలట్, గహ్లోత్ వర్గాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు ఇప్పట్లో సమసిపోవని తాజా ప్రకటనతో వెల్లడవుతోంది. మరోపక్క శనివారం రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతాస్రా మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణ జరుగుతుందని, పార్టీలో ఏ సమస్యా లేదని వెల్లడించారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు.
ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సన్నిహితుడు జితేంద్ర ప్రసాద భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సచిన్ పైలట్ కూడా కాంగ్రెస్ను వీడతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు తగ్గట్టే ఆయన దిల్లీకి వెళ్లారు. పది నెలలుగా నెరవేరిన డిమాండ్ల గురించి ఒత్తిడి తెచ్చేందుకు అక్కడ ఉన్నట్లు ఆయన చెప్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం