Eatala Rajender: ఎటూగాని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారు: ఈటల రాజేందర్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ.. భాజపా కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ.. భాజపా కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. ఎటూగాని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్తో భేటీ అయిన ఈటల.. గోషామహల్ భాజపా నేతలతో సమావేశమయ్యారు.
భేటీ అనంతరం ఈటల మాట్లాడుతూ.. ‘‘భాజపా కార్యకర్తలపై భారాస ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గోషామహల్లో భాజపా కార్పొరేటర్లను భారాస నేతలు వేధిస్తున్నారు. భాజపా కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ శశికళపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గజ్వేల్లో అకారణంగా దాడి చేసి కొట్టారు. కేసులు పెట్టారు. 14 రోజులు జైల్లో పెట్టారు. ఈ రోజు బెయిల్పై బయటకు వచ్చారు. మీర్పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు.
భాజపా కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని భారాస నేతలు దాడులు చేస్తున్నారు. హుజూరాబాద్లో ఓ సర్పంచ్ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం పార్టీ అధిష్ఠానం పరిధిలో ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. రాజాసింగ్పై వేసిన సస్పెన్షన్ను ఎత్తివేసేలా పార్టీ పెద్దలతో మాట్లాడతా’’ అని ఈటల వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!