Viveka Murdercase: వివేకా హత్యకేసులో ఆ ఇద్దరినీ కాపాడేందుకు విశ్వప్రయత్నం: డీఎల్ రవీంద్రారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన వైకాపా నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ
ఖాజీపేట: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన వైకాపా నేతల ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. వివేకా హత్య కేసులో సునీత కుటుంబం ప్రమేయం లేకపోయినా వారిపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా ఖాజీపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసును సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ కేసులో ఇద్దరు పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోందని.. దీనిపై సీబీఐ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సొంత బాబాయి దారుణహత్యకు గురైతే సీఎం జగన్ ఆ రోజు సాయంత్రం వరకు పులివెందులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో నిందితులు ఎవరైనా సరే తప్పించుకోలేరని రవీంద్రారెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.