Nitish Kumar: గతం మర్చిపోదాం.. తేజస్వీతో నీతీశ్ వ్యాఖ్య
బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్.. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తన ప్రత్యర్థి అయిన ఆర్జేడీతో
పట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) నేత నీతీశ్ కుమార్.. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తన ప్రత్యర్థి అయిన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా అనంతరం నేరుగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నివాసానికి వెళ్లిన నీతీశ్.. ఆయనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.
ఈ సందర్భంగా తేజస్వీతో నీతీశ్ మాట్లాడుతూ.. ‘‘2017లో ఏం జరిగిందో అదంతా మర్చిపోదాం. కొత్త అధ్యాయాన్ని మొదలుపెడతాం’’ అని చెప్పినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మహాగఠ్బంధన్ కూటమి నుంచి విడిపోయి తాను తప్పుచేశానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నానని నీతీశ్ విచారం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి.
నీతీశ్తో పొత్తుకు తేజస్వీ యాదవ్ సుముఖత వ్యక్తం చేశారు. జేడీ(యు)కు ఆర్జేడీ మద్దతిస్తున్నట్లు పేర్కొంటూ ఓ లేఖకు గవర్నర్కు అందజేయనున్నారు. ఈ క్రమంలోనే మహాగఠ్బంధన్ కూటమి నేతగా నీతీశ్ను ఎన్నుకున్నట్లు సమాచారం. మరికాసేపట్లో నీతీశ్.. తేజస్వీతో కలిసి రాజ్భవన్కు వెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు గవర్నర్ను కోరే అవకాశముంది. మరోవైపు జీతన్రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామీ మోర్చా కూడా నీతీశ్కు మద్దతు ప్రకటించింది.
బిహార్ ప్రజలను మోసం చేశారు..
మరోవైపు ఎన్డీయే కూటమి నుంచి జేడీ(యు) బంధం తెంచుకోవడంపై కాషాయ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నీతీశ్.. భాజపాను, బిహార్ ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబడుతున్నారు. ‘‘2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కింద మేం పోటీ చేసి విజయం సాధించాం. మాకు సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. నీతీశ్ను సీఎంగా ఎన్నుకున్నాం. కానీ, ఈ రోజు ఆయన భాజపాను, బిహార్ ప్రజలను మోసం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటీకీ సహించబోరు’’ అని బిహార్ భాజపా చీఫ్ సంజయ్ జైశ్వాల్ ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!