చేతకాదా చెప్పండి రాజధాని మేం కడతాం!
రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు అని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు తమ పార్టీ సంఘీభావం ప్రకటించినట్లు తెలిపారు. రాజధాని తరలింపు ప్రకటన నేపథ్యంలో...
రాజధాని గ్రామాల్లో మిలటరీ పాలన నడుస్తోందంటూ నారాయణ ఆగ్రహం
హైదరాబాద్: రాజధాని అమరావతి ఆంధ్రుల హక్కు అని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు తమ పార్టీ సంఘీభావం ప్రకటించినట్లు తెలిపారు. రాజధాని తరలింపు ప్రకటన నేపథ్యంలో అమరావతి 29 గ్రామాల్లో మిలటరీ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని ముగ్దూం భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎన్ఆర్సీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అలజడి సృష్టించిందని నారాయణ వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మించలేనని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.4 లక్షల కోట్ల బడ్జెట్ అయినా సరిపోదంటూ నారాయణ ఎద్దేవా చేశారు. తల ఒక చోట.. మొండెం మరో చోట అంటే కుదరదన్నారు. అమరావతిలో 12.5 వేల ఎకరాల భూమిని అభివృద్ధికి ఇస్తే పైసా ఖర్చు చేయకుండా అద్భుతమైన రాజధానిని నిర్మించవచ్చని నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ బాధ్యత తమకు అప్పగిస్తే రాజధాని కట్టిచూపుతామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు అజీజ్ పాషా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత