పాచిపోయిన లడ్డూల్లో కిస్మిస్ వేశారా?:అంబటి
ఏ ప్రభుత్వమైనా వైఫల్యం చెందిందని ఏడు నెలల్లో నిర్ణయిస్తారా? అని వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ఎవరూ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను
అమరావతి: ఏ ప్రభుత్వమైనా వైఫల్యం చెందిందని ఏడు నెలల్లో నిర్ణయిస్తారా? అని వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ఎవరూ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై భాజపా, జనసేన నేతలు చేసిన విమర్శలపై అంబటి స్పందించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమపై విమర్శలు చేసినందునే సమాధానం ఇవ్వాలని మీడియా ముందుకొచ్చామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైకాపా భయపడదని చెప్పారు. తమ పోకడ, పద్ధతులే వేరని వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటిచేత్తో 151 సీట్లు గెలుచుకున్నామని.. సీట్ల విషయంలో కూడికలు, తీసివేతలతో తామెప్పుడూ రాజకీయాలు చేయలేదని చెప్పారు.
పవన్కు స్థిరత్వం లేదు
రాజకీయంగా, వ్యక్తిగతంగా జనసేన అధినేత పవన్కల్యాణ్కు స్థిరత్వం లేదని అంబటి వ్యాఖ్యానించారు. అయితే బేషరతుగా భాజపాతో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ను ఆయన నిలదీశారు. పాచిపోయిన లడ్డూలు అంటూ భాజపాపై గతంలో ఆయన విమర్శలు గుప్పించారని..ఇప్పుడు తాజా లడ్డూలు పంపించారా? అని అంబటి ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా బేషరతుగా ఎందుకు మద్దతిస్తున్నాని ప్రశ్నించారు. రాష్ట్రానికి భాజపాతోనే న్యాయం జరుగుతుందని నమ్మిన పవన్.. ‘హోదా’ గురించి మమ్మల్ని ప్రశ్నించడమేంటని విమర్శించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే రాజకీయ కూటమి ఏర్పాటు చేశారా? అని అంబటి ప్రశ్నించారు. రాజకీయ స్థిరత్వంలేని పవన్.. నాలుగున్నరేళ్లు ఒకే పార్టీతో ఉండగలరా? అని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్ని పార్టీలు కలిసినా మాకు నష్టం లేదు
‘‘పవన్ ఏ పార్టీ కార్యాలయంలో కూర్చొంటారో ఆ పార్టీకి మద్దతిస్తారు. ఆయన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. ఆనాడు పాచిపోయిన లడ్డూలు అన్నారు.. ఇప్పుడు వాటిలో కిస్మిస్ వేశారా? 2014లో తెదేపా, భాజపా.. 2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిశారు. ఇప్పుడు భాజపాతో వెళ్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైకాపాకు నష్టం లేదు. కులతత్వం ఎక్కడ చూపించామో నిరూపించాలి. భాజపా, జనసేన పెద్దగా గుర్తింపు లేని పార్టీలు. గత ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయో అందరికీ తెలుసు’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..