ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారు:ఉత్తమ్
తెలంగాణలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారని.. న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే తెరాసకు ఒక్క సీటు కూడా దక్కదని ఉత్తమ్ అన్నారు. ఎన్నికల ప్రకటన, నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి లేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయని ఉత్తమ్ చెప్పారు. వార్డు రిజర్వేషన్లను తెరాస ముందుగానే తెలుసుకొని రాజకీయ లబ్ధి పొందిందని ఉత్తమ్ ఆరోపించారు. ఎన్నికల నోటిషికేషన్, నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి కావాలని మాత్రమే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 500 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ ఖండించారు. తెరాస నేతలు స్థానిక పోలీసుల సాయంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలోనే కొట్టి, వేసిన నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. బ్యాక్ డోర్ పద్ధతుల ద్వారా విజయాన్ని సాధించేందుకు తెరాస ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస బూటకపు వాగ్దానాలను విశ్వసించొద్దని ఉత్తమ్ ప్రజలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత