90 శాతం తెరాసవే: పల్లా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో...

Updated : 22 Jan 2020 19:33 IST

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెరాస కైవసం చేసుకుంటుందని తెరాస ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం.. సరైన అభ్యర్థులను ఎంచుకోవడంలో ప్రతిపక్షాలు మరోసారి విఫలమయ్యాయని రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్లు తెరాసకు మద్దతుగా నిలిచారని అయన పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. అభ్యర్థుల విజయం కోసం శ్రమించిన తెరాస కార్యకర్తలకు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని