సీఏఏ రద్దు తీర్మానానికి బెంగాల్ ఆమోదం
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సీఎం మమతా బెనర్జీ
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. దేశ ప్రజలను విడదీసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడగలిగే ధైర్యం తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చారు.
బెంగాల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పార్ధ ఛటర్జీ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ సీఏఏ కారణంగా దేశమంతా ఆందోళనకర వాతావరణం ఏర్పడిందన్నారు. దేశాన్ని విభజించేందుకు లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టానికి ఎంతమాత్రం మద్దతిచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ‘బెంగాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను ఎట్టి పరిస్థితుల్లోను అమలు చేసేది లేదు. వీటి వల్ల ప్రజలు తమ దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు’ అని ఆమె అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీఏఏను తీసుకొచ్చిన నాటి నుంచి ఆమె దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆమె కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే పలుమార్లు ర్యాలీని నిర్వహించారు. పంజాబ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలు ఇటీవలే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!