కేంద్రానికి మంత్రి నిరంజన్‌ రెడ్డి లేఖ

కందుల కొనుగోలు కోటాను పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2.7లక్షల మెట్రిక్‌ టన్నుల కందుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Published : 06 Feb 2020 18:32 IST

హైదరాబాద్‌: కందుల కొనుగోలు కోటాను పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2.7లక్షల మెట్రిక్‌ టన్నుల కందుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు కందుల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి మంత్రి లేఖ రాశారు. 47.5 వేల మెట్రిక్‌ టన్నులకు అదనంగా మరో 56వేల మెట్రిక్‌ టన్నుల కందుల కొనుగోలుకు అవకాశం కల్పించాలని లేఖలో కోరారు.

అనంతరం పలు శాఖల అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. సహకార ఎన్నికల అనంతరం డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలు అన్నీ సకాలంలో పూర్తి కావాలని అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌ ఫామ్‌ మొక్కలు రైతులకు అందుబాటులో ఉంచి సాగు చేయాలనుకుంటున్న రైతులకు ప్రోత్సాహం అందించాలన్నారు. యూరియా పంపిణీలో జాప్యం చేయకూడదని, ప్రతివారం ఎరువుల కంపెనీలతో సమీక్షలు నిర్వహించాలని మంత్రి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని