రాజధాని అంశంపై స్పందించిన ఉండవల్లి

ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ర్టంలో పెట్టుబడులు ఎవరు పెడతారని.. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి

Published : 07 Feb 2020 00:32 IST

రాజమహేంద్రవరం: ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ర్టంలో పెట్టుబడులు ఎవరు పెడతారని.. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా జరుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ర్టంలోనూ మూడు రాజధానుల అంశం లేదని.. ఇక్కడే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. రాజధాని రైతుల దృష్టిలో తమను నష్టపరిచిన వ్యక్తిగా సీఎం జగన్ నిలిచారని ఉండవల్లి ఆక్షేపించారు.

పదేళ్లలో విశాఖను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పడం సరికాదన్నారు. హైదరాబాద్‌ను అలానే చేసి నష్టపోయామని చెప్పారు. 60శాతానికి పైగా ధనవంతులు ఉన్న రాష్ట్రంగా పంజాబ్ గుర్తింపు పొందిందని.. అక్కడి నగరాల్లో 10 లక్షలకు మించి జనాభా ఉండదన్నారు. పోలవరం నిర్మాణ పనులు సరిగా జరగడం లేదని ఉండవల్లి ఆరోపించారు. ప్రత్యేకహోదా సాధ్యం కాకపోతే  రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా పన్ను రాయితీలైనా ఇవ్వాల్సిన అవసరముందని.. అలాంటప్పుడే ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని