దిల్లీ ఫైట్: నా సిక్స్త్ సెన్స్ ఏంచెబుతోందంటే?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వస్తున్న సంకేతాలు, తన సిక్స్త్ సెన్స్ చెబుతున్న దాన్ని బట్టి దేశ .......
దిల్లీ ఎన్నికలపై భాజపా దిల్లీ చీఫ్ ఆసక్తికరవ్యాఖ్యలు
దిల్లీ: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వస్తున్న సంకేతాలు, తన సిక్స్త్ సెన్స్ చెబుతున్న దాన్ని బట్టి దేశ రాజధానిలో భాజపానే అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సారథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో భాజపా అధికారం దక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తన తల్లి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో భాజపా గెలిస్తే మీరే సీఎం అవుతారా అని విలేకర్లు ప్రశ్నంచగా.. సమాధానాన్ని ఆయన దాట వేశారు.
50కి పైగా సీట్లు మావే..
భాజపాకు 50కి పైగా స్థానాలు వస్తాయని.. ప్రజల ఆశీర్వాదంతో నరేంద్రమోదీ నాయకత్వంలో దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మనోజ్ తివారీ ధీమా వ్యక్తంచేశారు. ఈ రోజు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం దిల్లీలోని పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పార్టీ గెలవాలని ప్రార్థించారు. అంతేకాకుండా నిన్న ఆయన రోడ్డుపై క్రికెట్ ఆడారు.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ 67 స్థానాలు గెలుచుకొని భారీ విజయం అందుకుంది. అనంతరం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా ఏడుకు ఏడు స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో దిల్లీ అ సెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!