మళ్లీ నామినేషన్లకు అవకాశం ఇవ్వాలి:యనమల
రాష్ట్రంలో వైకాపా రాక్షసత్వానికి సమాన పదం నిఘంటువులో కూడా లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్న ప్రతిచోటా ఎన్నిక రద్దు చేయాలని..
అమరావతి: రాష్ట్రంలో వైకాపా రాక్షసత్వానికి సమాన పదం నిఘంటువులో కూడా లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్న ప్రతిచోటా ఎన్నిక రద్దు చేయాలని.. మళ్లీ నామినేషన్లకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో కోర్టులే జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలన్నారు. తెదేపా నేతల ఇళ్లలో పోలీసులే మద్యం సీసాలు పెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని యనమల ఆరోపించారు.
ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతతోనే స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయం వైకాపాకు ఏర్పడిందన్నారు. అందుకే కండబలం, ఆర్థికబలం, మంద బలంతో అరాచకాలకు పాల్పడుతోందని ఆక్షేపించారు. ప్రభుత్వం, మంత్రులు కలిసి ఎన్నికల ప్రక్రియనే అప్రదిష్టపాలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించే హక్కు ఎవరికైనా ఉంటుందని ఆయన అన్నారు. తెదేపా నాయకుల పర్యటనపై ప్రశ్నించడానికి మంత్రి బొత్స ఎవరని.. పర్యటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత