ఏపీలోనే ఎక్కువ కరోనా పరీక్షలు: బుగ్గన
కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే.. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని...
విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే.. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నది రాష్ట్రంలోనే అని వివరించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు హైరిస్క్ జోన్లుగా ఉన్నాయని తెలిపారు.
ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం 9 ల్యాబ్లు ఏర్పాటు చేశామని, త్వరలో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా ఎక్కువ మంది బాధితులను గుర్తిస్తున్నామన్నారు. నెలరోజుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోగలిగామని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో నివేదికలు వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల నుంచి రావడం వల్ల కొన్ని జిల్లాల్లో కేసులు పెరిగాయని బుగ్గన తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది చనిపోయారని, వారంతా ఇతర వ్యాధులతో బాధపడేవారు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లేనని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్