ఛత్తీస్గఢ్ తొలి సీఎం అజిత్ జోగి ఇకలేరు
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జె) పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి (74) కన్నుమూశారు.......
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జె) పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మే 9న రాయ్పూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆరోగ్యం అత్యంత విషమించడంతో వెంటిలేటర్లపై శ్వాస అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అజిత్ జోగి మరణించినట్టు ఆయన తనయుడు అమిత్ జోగి ట్విటర్లో వెల్లడించారు.
1946 ఏప్రిల్ 29న బిలాస్పూర్లో జన్మించిన అజిత్ జోగి భోపాల్లోని మౌలానా అజాద్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. రాజకీయాలకంటే ముందు ఐఏఎస్కు ఎంపికైన ఆయన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే 2000సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా (2000-2003 మధ్యకాలంలో) అజిత్ జోగి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో కాంగ్రెస్తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్బై చెప్పి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జె) పార్టీని స్థాపించారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడిన అజిత్ జోగి.. చక్రాల కుర్చీ నుంచే రాజకీయాలు నడిపారు.
1986- 1998 మధ్యకాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. అలాగే, 1998 లోక్సభ ఎన్నికల్లో రాయగఢ్ నియోజకవర్గం నుంచి, 2004 ఎన్నికల్లో గెలిచి మహసముండ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1998 నుంచి 2000 మధ్య కాలంలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గానూ ఉన్నారు. 2008లో మర్వాహి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగంపై అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగిలపై కాంగ్రెస్ ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. దీంతో పార్టీకి దూరమైన ఆయన 2016 జూన్ 23న జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జె) పార్టీని స్థాపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.