కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: కళా
ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. దళితులపై వైకాపా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. బుధవారం మీడియాతో
విజయవాడ: ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. దళితులపై వైకాపా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మంగారు చెప్తే ఎవరి గురించో అనుకున్నాం.. కానీ, ఆయన చెప్పింది వైకాపా నేతల గురించేనని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. చివరికి ఇసుక, మట్టి కూడా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే.. ఇప్పుడు ఇసుక కావాలంటే వైకాపా నేతలకు ప్రజలు కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
ఇసుక రీచ్లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే వైకాపా నేతల ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. వైకాపా పాలనలో ఇసుక కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ధర రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పలికిందని.. ఇప్పుడు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఇసుక కొనలేక ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేసి మొండి గోడల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇసుక దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేసి సామాన్యులకు పూర్తిగా ఇసుక అందుబాటులోకి వచ్చేవిధంగా దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఇసుక తుపానులో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని కళా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం