AP News: కుప్పంలో తెదేపా అభ్యర్థి నామినేషన్‌ పత్రాలు లాక్కెళ్లిపోయారు..

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి

Updated : 23 Aug 2022 12:49 IST

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి నామినేషన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఇవాళే ఆఖరి రోజు. దీంతో 14వ వార్డుకు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. అతడి వద్ద నుంచి నామినేషన్‌ పత్రాలను పలువురు లాక్కున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ చేతికి గాయమైంది.

మరోవైపు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెదేపా, వైకాపాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ పురపాలిక ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పట్టు నిలుపుకోవాలని తెదేపా, పాగా వేయాలని వైకాపా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని