Andhra News: ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో బాలినేని?
ఏపీ మంత్రివర్గ జాబితాలో తన పేరు లేనందున వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి
ఒంగోలు: ఏపీ మంత్రివర్గ జాబితాలో తన పేరు లేనందున వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై ఇప్పటికే ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. సీఎం జగన్ నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసే యోచనలో బాలినేని ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని అంశంపై ఆయన మాట్లాడనున్నారు.
మరోవైపు బాలినేనికి కేబినెట్లో చోటు దక్కకపోవడంపై ఆయన సొంత నియోజకవర్గం ఒంగోలులో వైకాపా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంతమాగులూరు ఎంపీపీ వెంకటరెడ్డి, ఒంగోలు మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొటారి రామచంద్రరావు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్నిచోట్ల ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా రాజీనామాలకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేబినెట్లో చోటుదక్కని నేపథ్యంలో హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె కుమార్తె రిషిత చెప్పారు. తన తల్లి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారని.. పార్టీకి మాత్రం కాదని ఆమె నిన్న రాత్రి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం