MK Stalin: నాశనం చేయాలనుకుని పతనమవుతున్నారు
డీఎంకేను నాశనం చేయాలనుకుని వారే పతనమవుతున్నారంటూ అన్నాడీఎంకేపై ముఖ్యమంత్రి స్టాలిన్ పరోక్ష విమర్శలు చేశారు. రెవెన్యూశాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ మనవరాలు దీప్తి-విశ్వక్సేన వివాహ కార్యక్రమం తిరువాన్మియూర్లో గురువారం జరిగింది.
అన్నాడీఎంకేపై స్టాలిన్ పరోక్ష విమర్శలు
వరుడికి మంగళసూత్రం అందిస్తున్న స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: డీఎంకేను నాశనం చేయాలనుకుని వారే పతనమవుతున్నారంటూ అన్నాడీఎంకేపై ముఖ్యమంత్రి స్టాలిన్ పరోక్ష విమర్శలు చేశారు. రెవెన్యూశాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ మనవరాలు దీప్తి-విశ్వక్సేన వివాహ కార్యక్రమం తిరువాన్మియూర్లో గురువారం జరిగింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడైన స్టాలిన్ అధ్యక్షత వహించి పెళ్లి కార్యక్రమాన్ని జరిపించారు. వధూవరులను ఆశీర్వదించి ఆయన ప్రసంగిస్తూ... ఈ కల్యాణ మండపంలో తమ ఇంటి పెళ్లి జరుగుతున్నట్టు భావించి అందరూ హాజరయ్యారని తెలిపారు. మరో కల్యాణ మండపంలో ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసంటూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశ తతంగాన్ని పరోక్షంగా ఉదహరించారు. ఆ విషయంలోకి వెళ్లదలచుకోలేదని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. అయితే వారే మనల్ని నాశనం చేయాలనుకుని ప్రస్తుతం వారే పతనమవుతున్నారని పేర్కొన్నారు. డీఎంకే పతనమైన చరిత్ర లేదన్నారు. కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ఎంజీఆర్, కరుణానిధి మంత్రివర్గాల్లోనూ ఉన్నారని, ప్రజాసేవలో ఆయన అంకితభావానికి ఇది నిదర్శనమని తెలిపారు. దక్షిణ ప్రాంతానికి పెరియ మరుదు, చిన్న మరుదుగా కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు ఉన్నారని, ఆ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రామచంద్రన్ కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధంతోనే ఆరోగ్యం నలతగా ఉన్నా పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. కార్యక్రమంలో స్టాలిన్ సతీమణి దుర్గా, టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, ద్రావిడర్ కళగం అధ్యక్షుడు వీరమణి, మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, సుబ్రమణియన్, పొన్ముడి తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు సాయం ప్రకటన
బాణసంచా పరిశ్రమలో పేలుడు దుర్ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలోని క్షతగాత్రురాలైన వసంతకు కడలూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సీఎం జనరల్ ఫండ్ నుంచి ప్రభుత్వ సాయం అందించాలని ఆదేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
కమిటీకి అభినందనలు
పుదుకోట్టై సంస్థానం రాజు రాజగోపాల తొండైమాన్ శత జయంత్యుత్సవాల కమిటీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాజగోపాల తొండైమాన్ శత జయంత్యుత్సవాలు గురువారం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో... స్వతంత్ర భారతదేశ హోంశాఖ మంత్రిగా ఉన్న సర్ధార్ వల్లభాయ్ పటేట్ పిలుపు మేరకు పుదుకోట్టై సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి రాజగోపాల తొండైమాన్ అంగీకరించారని తెలిపారు. సంస్థానం ఖజానా నుంచి రూ.53 లక్షల విలువైన నగలు, నగదు అప్పగించిన మహనీయుడని కొనియాడారు. శత జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన నిరాడంబరత, సేవలను స్మరించుకోవాలన్నారు. ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
వరద నివారణ చర్యలపై సమీక్ష
నగరంలో జరుగుతున్న వరద నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఇందులో చెన్నై, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వరద నివారణ చర్యల గురించి సమీక్షించారు. పనుల ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, వేలు, అన్బరసన్, సుబ్రమణియన్, శేఖర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం