Komatireddy: ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికలపుడు చెబుతా: కోమటిరెడ్డి
సాధారణ ఎన్నికలకు నెల ముందు భావి కార్యాచరణ ప్రకటిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. నల్గొండ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికలప్పుడే తెలుస్తుందన్నారు.
ఈనాడు, దిల్లీ: సాధారణ ఎన్నికలకు నెల ముందు భావి కార్యాచరణ ప్రకటిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. నల్గొండ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి అనేది ఎన్నికలప్పుడే తెలుస్తుందన్నారు. ప్రధాని మోదీని శుక్రవారం ఆయన కలిశారు. 20 నిమిషాలకుపైగా వారి భేటీ సాగింది. అనంతరం తన నివాసంలో ఎంపీ విలేకరులతో మాట్లాడారు. నమామి గంగా మాదిరి మూసీ ప్రక్షాళన చేపట్టాలని ప్రధానిని కోరగా కమిటీ వేస్తానని మోదీ హామీ ఇచ్చారన్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ, జనగాం-భువనగిరిల మధ్య ఎంఎంటీఎస్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెంకట్రెడ్డి చెప్పారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.90 కోట్లు చెల్లించాలని కోరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ అభ్యర్థిస్తానని తెలిపారు. కేసీఆర్ బంధువుకు నైనీ కోల్బ్లాక్ టెండర్ కట్టబెట్టేందుకు జాయింట్ వెంచర్ అనే క్లాజ్ తొలగించి చేసిన యత్నాలను ఎంపీగా అడ్డుకొని రూ.30వేల కోట్లు దేశానికి, సింగరేణికి మిగల్చటంపై ప్రధాని తనను అభినందించారని కోమటిరెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.