పోలీసులు లేరు.. అందుకే ఆపేశా
భద్రతా కారణాలతో జమ్మూకశ్మీర్లో జరుగుతున్న భారత జోడో యాత్ర నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ శుక్రవారం తప్పుకొన్నారు.
జమ్మూకశ్మీర్లో జోడో యాత్ర తాత్కాలిక నిలిపివేత: రాహుల్
భద్రతా లోపాలపై కాంగ్రెస్ ఆగ్రహం
భారీగా జనం వస్తారని చెప్పలేదు: పోలీసులు
కాజీగుండ్: భద్రతా కారణాలతో జమ్మూకశ్మీర్లో జరుగుతున్న భారత జోడో యాత్ర నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ శుక్రవారం తప్పుకొన్నారు. తనకు సరైన రక్షణ కల్పించ[కపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. జనాన్ని నియంత్రించే పోలీసులు ఎక్కడా కనిపించలేదని, దీంతో తన భద్రతా సిబ్బంది సూచన మేరకు యాత్ర నుంచి వైదొలిగానని తెలిపారు. శనివారం నుంచి తన యాత్ర యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. శుక్రవారం జమ్ము ప్రాంతంలోని బనిహాల్ నుంచి జవహార్లాల్ సొరంగం గుండా..కాజీగుండ్లోకి ప్రవేశించిన రాహుల్.. 500 మీటర్లు నడిచిన తర్వాత యాత్రనుంచి విరమించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ‘‘జనాన్ని నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదు’’ అని రాహుల్ ఆరోపించారు. తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత జమ్మూకశ్మీర్ పోలీసులదేనని అన్నారు. భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రాజకీయాలు చేయొచ్చు. కానీ రాహుల్ భద్రతతో ఆటలు సమంజసం కాదు. ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోంది’’ అని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్.. కేంద్రంపై మండిపడ్డారు. ఇప్పటికే దేశం ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలను కోల్పోయిందని, ఇలాంటి విషయాల్లో అధికారులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని అన్నారు. రాహుల్కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. ఈ ఆరోపణలను జమ్మూకశ్మీర్ పోలీసులు ఖండించారు. భారీగా జనం హాజరుకానున్నారన్న విషయాన్ని నిర్వాహకులు తమకు తెలియచేయలేదని తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే యాత్రను నిలిపివేశారని చెప్పారు. అంతకుముందు రాహుల్యాత్రలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. దేశంలోని మైనారిటీలను లక్ష్యం చేసుకుంటూ సాగుతున్న దాడుల నేపథ్యంలోనే రాహుల్ ఈ యాత్ర ప్రారంభించారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్