ముఖ్యమంత్రి జగన్‌కు ‘అప్పురత్న’ అవార్డు

అప్పులతో ‘ఆంధ్ర’ పేరును మారుమోగిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

Updated : 08 Feb 2023 06:30 IST

పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా

ఈనాడు, అమరావతి: అప్పులతో ‘ఆంధ్ర’ పేరును మారుమోగిస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ‘అప్పురత్న సీఎం’ హ్యాష్‌టాగ్‌తో సీఎం జగన్‌కు అప్పురత్న అవార్డు అందిస్తున్నట్లున్న వ్యంగ్యచిత్రాన్ని ఆయన ట్వీట్‌చేశారు. ‘భారతరత్నలా ఇది కూడా ప్రతిష్ఠాత్మక అవార్డట సార్‌’ అని అందులో ఒకరు సీఎం జగన్‌తో చెబుతున్నట్లు అందులో ఉంది. వైకాపా ప్రభుత్వం రికార్డుస్థాయిలో 9 నెలల్లో రూ.55,555 కోట్ల అప్పు చేసిందన్నారు. ‘రాష్ట్రం సర్వనాశనమైనా సరే, మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మరచిపోకండి. దీనికి ముఖ్యమంత్రి స్ఫూర్తి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని