రేవంత్పై చట్టపరమైన చర్యలు తప్పవు!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతిభవన్ మీద మావోయిస్టులు గ్రనేడ్లు వేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లు విమర్శించారు.
వెంటనే క్షమాపణలు చెప్పాలి
ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించాలి
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతిభవన్ మీద మావోయిస్టులు గ్రనేడ్లు వేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లు విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను భారాస పార్టీ, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తగిన పరిణామాలుంటాయని.. ప్రజలు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. సీఎం, హోంశాఖ మంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా? లేదా ఇదే కాంగ్రెస్ విధానమా? స్పష్టం చేయాలన్నారు. ఆయనను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్లతో కలిసి ఎర్రబెల్లి, సత్యవతి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘మావోయిస్టులకు, ప్రజలకు రేవంత్ క్షమాపణలు చెప్పాలి. అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ప్రగతిభవన్ను పేల్చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. లేకపోతే ఆ పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
డీజీపీకి భారాస ఎమ్మెల్సీల ఫిర్యాదు
ప్రగతిభవన్ను పేల్చేయాలంటూ వ్యాఖ్యానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారాస ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈమేరకు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎల్.రమణ, శంభీపూర్ రాజు, తాతా మధు, విఠల్, తక్కెళ్లపల్లి రవీందర్రావులు బుధవారం హైదరాబాద్లో డీజీపీ అంజనీకుమార్ను కలిసి ఫిర్యాదు అందించారు. ‘‘చట్టసభల్లో సభ్యుడిగా ఉంటూ అధికారిక భవనాలను పేల్చేయాలని వ్యాఖ్యలు చేయడం చట్టవ్యతిరేక చర్యగా భావించాలి. రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక