దిల్లీలో విపక్ష నేతల భేటీ నేడు
సార్వత్రిక ఎన్నికలు(2024) సమీపిస్తున్న వేళ విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు(2024) సమీపిస్తున్న వేళ విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎన్నికలకు సంబంధించిన విషయాలు, ఈవీఎంల సామర్థ్యం తదితర అంశాలపై చర్చించుకుందామంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వివిధ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు దిల్లీలో ఈ సమావేశం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు ఈవీఎంలపై తలెత్తుతున్న సందేహాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ నివృత్తి చేయాల్సి ఉంటుందని శరద్ పవార్ పేర్కొన్నారు. చిప్ కలిగి ఉన్న ఏ యంత్రమైనా హైజాక్కు గురయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటూ నిపుణులు వెల్లడిస్తున్న వివిధ అంశాలను పవార్ ఆహ్వాన లేఖల్లో ప్రస్తావించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/2023)
-
India News
Delhi: రూ.1400కోట్ల వ్యయంతో.. దిల్లీలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ!
-
Movies News
Bellamkonda Ganesh: అప్పుడు రిలీజ్ డేట్ సరిగ్గా ప్లాన్ చేయలేదనే టాక్ వినిపించింది: బెల్లంకొండ గణేశ్
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్పై సెహ్వాగ్ ఫైర్
-
Movies News
The Night Manager: ‘ది నైట్ మేనేజర్’.. పార్ట్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన