కలిసికట్టుగా.. గెలుపు జట్టుగా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయానికి తెదేపా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేశారు. రకరకాల సమస్యలు ఎదురైనా.. వాటిని అధిగమించి 19 మంది ఎమ్మెల్యేలూ వచ్చి ఓటేశారు.
వ్యూహాత్మకంగా అనురాధను గెలిపించుకున్న తెదేపా
ఈనాడు - అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయానికి తెదేపా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేశారు. రకరకాల సమస్యలు ఎదురైనా.. వాటిని అధిగమించి 19 మంది ఎమ్మెల్యేలూ వచ్చి ఓటేశారు. ఒక్క ఓటు చేజారనీయకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. శస్త్రచికిత్స చేయించుకున్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ నెల 25 వరకు కదిలే పరిస్థితి లేదు. అయినా వైద్య సలహాలు తీసుకుంటూ వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా చక్రాల కుర్చీలో అతి కష్టంపై వచ్చి ఓటేశారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని బుధవారమే విజయవాడ చేరుకున్నారు. ఆమె భర్త, మామను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో తిరిగి రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి గురువారం ఆమె ఓటేసేందుకు వచ్చారు. గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి గతంలో రెండుసార్లు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే పంపారు. ఉప ఎన్నిక వస్తుందనే భయంతో ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచి ఆయన రాజీనామాను సభాపతి ఆమోదించారనే ప్రచారం జరిగింది. గతంలో ఒక టీవీ చర్చ సందర్భంగా గంటాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అనురాధ చెప్పారు. ఇప్పుడు ఆమె స్వయంగా మద్దతు కోరడంతో.. గంటా శ్రీనివాసరావు ముందుకొచ్చి అనురాధను బలపరుస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. తెదేపాలో మొదటి ఓటు ఆదిరెడ్డి భవాని, చివరగా పయ్యావుల కేశవ్ వేశారు. ఉదయం 11.15 గంటలకు చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరి శాసనసభకు వచ్చారు. ఎన్నికల ఏజంట్లుగా నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత