మోదీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.
ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
విజయవాడ(విద్యాధరపురం), న్యూస్టుడే : ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ నరేంద్రమోదీ, అమిత్షాలు దేశ భవిష్యత్తును అదానీ, అంబానీలకు అప్పగించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా భాజపా పాలనను ఎండగడతామన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన భాజపా చర్యలను దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్పందించాలన్నారు. కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు రామకృష్ణతోపాటు సీపీఐ నాయకులు జెల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక