Pawan Kalyan: వైకాపా మైండ్గేమ్కు లొంగొద్దు
రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల విషయంలో జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ విషయంలో వైకాపా మైండ్గేమ్ ఆడుతోందని, దానికి ఎవరూ లొంగవద్దని జనసేన అధినేత పవన్కల్యాణ్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
పొత్తులు, పార్టీ వ్యూహంపై స్పష్టంగా చెబుతా
నాయకులకు జనసేన అధినేత దిశానిర్దేశం?
ఈనాడు,ఈనాడు డిజిటల్, అమరావతి: రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల విషయంలో జనసేన వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ విషయంలో వైకాపా మైండ్గేమ్ ఆడుతోందని, దానికి ఎవరూ లొంగవద్దని జనసేన అధినేత పవన్కల్యాణ్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్లో ఆయన గురువారం కొద్దిమంది నాయకులకు ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. పవన్కల్యాణ్ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పార్టీశ్రేణులకు అంతర్గతంగా దీనిపై ఒక నోట్ పంపారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై పార్టీశ్రేణులు అనవసర ఆందోళన చెందవద్దని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పార్టీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పార్టీ అధినేత పవన్కల్యాణ్ వైకాపా వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని ప్రకటించారని, ఆయన ఈ ప్రకటన చేసినప్పటి నుంచి వైకాపా మైండ్గేమ్ ఆడుతోందని జనసేన పార్టీ తమ శ్రేణులను గురువారం అప్రమత్తం చేసింది. ప్రతిపక్ష నాయకుల పేర్లతో, జనసేన నాయకుల పేర్లతో ఈ పొత్తులపై ఏవేవో మాట్లాడారన్నట్లుగా తప్పుడు ప్రకటనలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టించడమే ఈ క్రీడలో భాగంగా వ్యవహరిస్తున్నారని తెలియజేసింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ విషయంలో గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావద్దని సూచించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను పార్టీ నాయకులకు పవన్కల్యాణ్ పారదర్శకంగా తెలియజేస్తారన్నారు.
కౌలు రైతుల కష్టాలకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం
రాష్ట్రంలో మూడువేల మంది కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వైకాపా ప్రభుత్వంలో కనీస చలనం లేదని జనసేన అధినేత పవన్కల్యాణ్ మండిపడ్డారు. కౌలురైతుల కష్టాలకు రాష్ట్రప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతుస్వరాజ్య వేదిక రాష్ట్రకమిటీ సభ్యులు గురువారం హైదరాబాద్లో పవన్కల్యాణ్తో సమావేశమయ్యారు. కౌలురైతుల ఇబ్బందులపై క్షేత్రస్థాయి అధ్యయన నివేదికను ఈ సందర్భంగా వారు పవన్కల్యాణ్కు అందజేశారు. ‘రైతుల కష్టాలపై త్వరలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిద్దాం. రాష్ట్రంలో 80 శాతం వరి పంట కౌలు సేద్యం నుంచే వస్తుంది. వరితో పాటు మిర్చి, పత్తి వేసిన వారూ నష్టపోతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని పవన్కల్యాణ్ తెలిపారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చేసిన రైతుభరోసా యాత్రల్లో 8 జిల్లాల్లో సుమారు 700 మందికి పైగా రైతులకు జనసేన ద్వారా ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. సమావేశంలో రైతుస్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్కుమార్, బి.కొండల్రెడ్డి, బాలు, కిసాన్మిత్ర హెల్ప్లైన్ ప్రతినిధులు శ్రీహర్ష, భార్గవి పాల్గొన్నారు.
నిరాహార దీక్ష చేస్తే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులా?
ఏర్పేడు, న్యూస్టుడే: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చిందేపల్లిలో రహదారి పునరుద్ధరణ కోసం నిరాహారదీక్ష చేస్తున్న గ్రామస్థులు, జనసేన శ్రేణులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక