ప్రభుత్వ ఆస్తుల విక్రయం ఆపండి: భట్టి
తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్ను సీఎల్పీ నేతగా కోరుతున్నానని భట్టి విక్రమార్క అన్నారు.
నెన్నెల, న్యూస్టుడే: తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ఇకనైనా ఆపాలని సీఎం కేసీఆర్ను సీఎల్పీ నేతగా కోరుతున్నానని భట్టి విక్రమార్క అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో శనివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని మెట్పల్లి, చిత్తాపూర్, కిష్టాపూర్, ఆవడం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆవడంలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూములను అయినవారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. వందల మంది యువకులు బలిదానం చేసి రాష్ట్రాన్ని సాధించింది ఆస్తులమ్మి అప్పుల తెలంగాణగా మార్చడానికి కాదన్నారు. సంపదను విక్రయించి పరిపాలన చేస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని భట్టి విమర్శించారు. తెలంగాణ స్కాంల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. ‘మిషన్ భగీరథలో రూ. వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ 200 కిలోమీటర్ల దూరం సాగిన నా పాదయాత్రలో ఒక్కరు కూడా తాగునీరు వస్తోందని చెప్పలేదు. కేవలం పైపులు బిగించి వదిలేశారు’ అని భట్టి తెలిపారు. నియోజకవర్గానికి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘వేల కోట్ల నిధులు గుత్తేదారులకు కట్టబెట్టి ఆస్తులు సంపాదిస్తున్నారు.. వాటిని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!