విశాఖలో భూకబ్జాలపై తెదేపా ఛార్జిషీట్
విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలపై ‘ఛార్జిషీట్’ ప్రకటించాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు.
రూపొందించాలని నేతలకు చంద్రబాబు సూచన
ఈనాడు- విశాఖపట్నం, న్యూస్టుడే- వన్టౌన్: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలపై ‘ఛార్జిషీట్’ ప్రకటించాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. బుధవారం విశాఖ వచ్చిన ఆయనను విమానాశ్రయంలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాల తెదేపా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్దా నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, డి.రామారావు, పలువురు పార్టీ నేతలు కలిశారు. కొందరు అచ్యుతాపురం, నగరంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయనతో పాటు కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా విశాఖలోని విలువైన భూములు కబ్జాకు గురవడంపై ప్రజలకు వివరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ, ఏ విధంగా అక్రమాలు జరిగాయో తెలిసేలా ఛార్జిషీట్ పేరుతో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ‘ప్రశాంత నగరంలో అలజడులు సృష్టించి, ప్రజలను భయాందోళనలకు గురిచేసి విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.వేల కోట్ల భూములు చేతులు మారాయి. ముఖ్యమైన భూ కబ్జాల్లో ఎవరెవరి హస్తం ఉంది. అందులో వైకాపా కీలక నేతల పాత్ర ఏమిటి? ఎలా వారి సొంతం చేసుకున్నారో తెలియజేసేలా వివరాలు ఉండాలి’ అని దిశానిర్దేశం తెలిసింది. విమానాశ్రయం నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా మధ్యలో మెడ్టెక్ జోన్ ప్రాంతాన్ని చూసి ‘మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ప్రగతి లేకుండా చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్