ఎమ్మెల్యే నిమ్మల అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధి పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాల అడ్డగింత
నిరసనకారులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
పాలకొల్లు పట్టణం, యలమంచిలి, గణపవరం, న్యూస్టుడే: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పరిధి పెరుగులంక భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా స్థానికులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో మట్టి తరలిస్తున్నారని తెలిసి సోమవారం రాత్రి పెరుగులంకలోనే నిద్రపోయారు. మంగళవారం ఉదయం నియోజకవర్గం పని మీద బయటకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన ఆయనను పెరుగులంక భూముల్లోకి వెళ్లకుండా డీఎస్పీ మనోహరాచారి తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే మీద దౌర్జన్యం ఏమిటి? నన్ను కాల్చేస్తారా..? నన్ను నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ డీఎస్పీపై అసహనం వ్యక్తం చేశారు. తన కారులో ఉన్న ఎమ్మెల్యే రామానాయుడును పోలీసులు దౌర్జన్యంగా దించి బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. దళితులు, సీపీఎం, సీపీఐ, తెదేపా నాయకులుఅడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నిరసనకారులను జీపులోకి ఎక్కించేటప్పుడు పోలీసులు పిడిగుద్దులు గుద్దడం, కారులో కుక్కడంతో పలువురు గాయపడ్డారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పురుష పోలీసులు లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో గాయాలైన నిరసనకారులను 60 కి.మీ.కు పైగా దూరం ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం గమనార్హం. కొంతమంది నిరసనకారులను తాడేపల్లిగూడెం పోలీస్స్టేషన్కు, శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడును గణపవరం పోలీస్స్టేషన్కు తరలించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గణపవరం స్టేషన్కు వచ్చి నిమ్మలకు సంఘీభావం తెలిపారు. రామానాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3గంటల పాటు స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు చింతకాయల బాబురావు పరామర్శించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీస్స్టేషన్ వద్ద ధర్నా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్